కేంద్రమంత్రులు రాజీనామా:ఏ.పి సీఎం
- March 07, 2018
కేంద్రం నుంచి మంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారని చంద్రబాబు చెప్పారు. అందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఏ పదవులు తీసుకోకుండా గతంలో కేంద్రానికి సహకరించామన్నారు. అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశంలో మట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం నుంచి వైదొలగాలని నిర్ణయించకున్నామన్నారు. ప్రధాని మోడీతో మాట్లాడాలని ప్రయత్నించానని, కాని సాధ్యం కాలేదన్నారు. అసెంబ్లీలో చాలా విపులంగా అంతా చెప్పానని, కాంగ్రెస్, బీజేపీలు చేసిన విషయాలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించానన్నారు. తాను అసెంబ్లీలో మాట్లాడిన కొంత సమయానికే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం పెట్టి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పారని, సెంటిమెంట్ తో కేటాయింపులు జరగవని చెప్పారని, ఇవన్నీ చూసిన తర్వాత కేంద్రం సాయం చేసే ఉద్దేశ్యం కనపడలేదన్నారు. తనకు జైట్లీ ప్రకటన బాధించిందన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని, దశలవారీగా తమ నిరసనను తెలియజేస్తామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో కొనసాగుతున్న తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు రేపు రాజీనామా చేస్తారని చంద్రబాబు వెల్లడించారు. రేపు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









