ఆ ఉల్లంఘనలకు జైలు శిక్ష లేదు
- March 07, 2018
రియాద్: వాహనాల్ని నడుపుతూ మొబైల్ ఫోన్ నడపడం, అలాగే వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి జైలు శిక్ష ఉండదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్పష్టతనిచ్చింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మానిటరింగ్ చర్యలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్, సీటు బెల్టుకి సంబంధించి ఉల్లంఘనల్ని ఈ పద్ధతుల్లో గుర్తిస్తున్నారు. ఈ రెండు ఉల్లంఘనలకు గాను కనిష్టంగా 150 సౌదీ రియాల్స్, గరిష్టంగా 300 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ - ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సమి అల్ షువైరిహ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









