ఆ ఉల్లంఘనలకు జైలు శిక్ష లేదు
- March 07, 2018రియాద్: వాహనాల్ని నడుపుతూ మొబైల్ ఫోన్ నడపడం, అలాగే వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి జైలు శిక్ష ఉండదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్పష్టతనిచ్చింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మానిటరింగ్ చర్యలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్, సీటు బెల్టుకి సంబంధించి ఉల్లంఘనల్ని ఈ పద్ధతుల్లో గుర్తిస్తున్నారు. ఈ రెండు ఉల్లంఘనలకు గాను కనిష్టంగా 150 సౌదీ రియాల్స్, గరిష్టంగా 300 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ - ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సమి అల్ షువైరిహ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..