హైదరాబాద్ యశోద ఆసుపత్రి లో రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స
- November 29, 2015
శనివారం నగరంలోని యశోద ఆసుపత్రిలో జరిగిన మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సతో ఇప్పటివరకు గుండెమార్పిడి శస్త్రచికిత్స 13కు చేరింది. ఇటీవల కాలంలో క్లిష్టమైన గుండె, కాలెయం, కిడ్నీ తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు హైదరాబాద్ నగరం నిలయమైంది. కేరళ రాష్ట్రం, తిరుచ్చి పట్టణం నుంచి నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి 30నిమిషాల 5సెకెన్లలో గుండెను తరలించారు. శనివారం ఉదయం కేరళా, తిరుచ్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే బాధితుడు బ్రెయిడ్ డెడ్కు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు జీవన్దాన్ అధికారిని అనురాధకు సమాచారం అందించారు. వెంటనే ఆమె యశోద ఆసుపత్రి గుండె మార్పిడి శస్త్రచికత్స నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకు సమాచారాన్ని ఇచ్చారు. దీంతో యశోద వైద్యబృందం ప్రత్యేక విమానంలో కేరళకు చేరుకుని గుండెను సేకరించారు. 3.30గంటలకు వైద్యులు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 4 గంటల 5 సెకన్లకు నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గుండెను వీలైనంత తొందరగా సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి అంబులెన్సులో చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేయడంతో మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి మూడు నిమిషాల్లో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి గుండెను తరలించారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నల్లకుంట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్రాజు(56) మూడు నెలల క్రితం యశోద ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యు లు గుండె మార్పిడి తప్పదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బాధితుడు తన పేరును జీవన్దాన్లో నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు శనివారం జీవన్దాన్ సహకారంతో యశోద వైద్యులు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన గుండెను శ్రీనివాస్కు అమర్చారు. రోగి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







