విషాదాన్ని దిగమింగి మళ్ళీ షూటింగ్ లో జాన్వి..!
- March 08, 2018
శ్రీదేవి సడెన్ డెత్ తో కుటుంబ సభ్యులతో పాటు.. సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు షాక్ కి గురయ్యాయి. ఇక శ్రీదేవి కి అత్యంత ఇష్టమైన కూతురు జాన్వికి తల్లి మరణం తీరని తీరని లోటు.. ఇక రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును అనాథాశ్రమంలో జరుపుకొన్నది.. కాగా జాన్వి తల్లి విషాదాంతాన్ని దిగమింగుకొని ధడక్ సినిమా సెట్ లో అడుగు పెట్టింది. తల్లి మరణంతో షూటింగ్ కు చాలా రోజులు బ్రేక్ ఇచ్చినా.. షెడ్యూల్ ప్రకారం మూవీ విడుదలకు సహకరించెందుకు సినిమా షూటింగ్ హాజరు కావాలని జాన్వి నిర్ణయించుకొన్నది. దీంతో బాంద్రా కార్టర్ రోడ్డులో సహ నటుడు ఇషాన్ ఖట్టర్ తో కలిసి జాన్వి షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ ను జరుపుకొని నెక్స్ట్ వీక్ చిత్ర యూనిట్ ఇంటర్వెల్ సీన్స్ ను తెరకెక్కించేందుకు కోల్ కతా పయనంకానున్నది. తమ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది అని దర్శకుడు శశాంక్ ఖైతాన్ చెప్పారు. తన కూతుర్ని వెండి తెరపై చూసుకోవాలి అన్న కోరిక తీరకుండానే.. శ్రీదేవి మృతి చెందింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!







