విషాదాన్ని దిగమింగి మళ్ళీ షూటింగ్ లో జాన్వి..!
- March 08, 2018
శ్రీదేవి సడెన్ డెత్ తో కుటుంబ సభ్యులతో పాటు.. సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు షాక్ కి గురయ్యాయి. ఇక శ్రీదేవి కి అత్యంత ఇష్టమైన కూతురు జాన్వికి తల్లి మరణం తీరని తీరని లోటు.. ఇక రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును అనాథాశ్రమంలో జరుపుకొన్నది.. కాగా జాన్వి తల్లి విషాదాంతాన్ని దిగమింగుకొని ధడక్ సినిమా సెట్ లో అడుగు పెట్టింది. తల్లి మరణంతో షూటింగ్ కు చాలా రోజులు బ్రేక్ ఇచ్చినా.. షెడ్యూల్ ప్రకారం మూవీ విడుదలకు సహకరించెందుకు సినిమా షూటింగ్ హాజరు కావాలని జాన్వి నిర్ణయించుకొన్నది. దీంతో బాంద్రా కార్టర్ రోడ్డులో సహ నటుడు ఇషాన్ ఖట్టర్ తో కలిసి జాన్వి షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ ను జరుపుకొని నెక్స్ట్ వీక్ చిత్ర యూనిట్ ఇంటర్వెల్ సీన్స్ ను తెరకెక్కించేందుకు కోల్ కతా పయనంకానున్నది. తమ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది అని దర్శకుడు శశాంక్ ఖైతాన్ చెప్పారు. తన కూతుర్ని వెండి తెరపై చూసుకోవాలి అన్న కోరిక తీరకుండానే.. శ్రీదేవి మృతి చెందింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









