విడుదలకు సిద్ధమైన 'తొలికిరణం' సినిమా
- March 08, 2018
కంప్యూటర్ గ్రాఫిక్స్ రూపకల్పనలో జరుగుతున్న ఆలస్యమే చిత్ర విడుదలలో జాప్యం జరిగేందుకు కారణమని చెబుతున్నారు తొలి కిరణం చిత్రయూనిట్ సభ్యులు. సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జాన్బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భానుచందర్ కీలక పాత్రలో నటించగా.పీడీ రాజు ఏసుక్రీస్తు పాత్రను పోషించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తొలి కిరణం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భగా నటుడు భానుచందర్ మాట్లాడుతూ.ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలన్నీ ఏసుక్రీస్తు జన్మించినప్పటి నుంచి శిలువ వేసే వరకు సాగుతాయి. ఆయన మరణించిన మూడు రోజుల తర్వాత సమాధి లోనుంచి లేచి వచ్చి శాంతి సందేశాన్నిస్తూ భూమిపై తిరిగారు. ఆ కథను తొలి కిరణం సినిమాలో దర్శకులు జాన్బాబు చూపిస్తున్నారు. సినిమా రషెస్ చూశాను చాలా చక్కగా సినిమాను రూపొందించారు. మా అబ్బాయి హీరోగా నా కొడుకు బంగారం అనే చిత్రాన్ని జాన్బాబు గారి దర్శకత్వంలోనే చేయబోతున్నాం. అన్నారు. దర్శకుడు జాన్బాబు మాట్లాడుతూ.లండన్లో గ్రాఫిక్స్ పనులు జరగడంలో ఆలస్యమైంది. అందుకే చిత్రాన్ని కొద్ది జాప్యంతో విడుదల చేస్తున్నాం. అన్నారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







