విడుదలకు సిద్ధమైన 'తొలికిరణం' సినిమా
- March 08, 2018
కంప్యూటర్ గ్రాఫిక్స్ రూపకల్పనలో జరుగుతున్న ఆలస్యమే చిత్ర విడుదలలో జాప్యం జరిగేందుకు కారణమని చెబుతున్నారు తొలి కిరణం చిత్రయూనిట్ సభ్యులు. సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జాన్బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భానుచందర్ కీలక పాత్రలో నటించగా.పీడీ రాజు ఏసుక్రీస్తు పాత్రను పోషించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తొలి కిరణం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భగా నటుడు భానుచందర్ మాట్లాడుతూ.ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలన్నీ ఏసుక్రీస్తు జన్మించినప్పటి నుంచి శిలువ వేసే వరకు సాగుతాయి. ఆయన మరణించిన మూడు రోజుల తర్వాత సమాధి లోనుంచి లేచి వచ్చి శాంతి సందేశాన్నిస్తూ భూమిపై తిరిగారు. ఆ కథను తొలి కిరణం సినిమాలో దర్శకులు జాన్బాబు చూపిస్తున్నారు. సినిమా రషెస్ చూశాను చాలా చక్కగా సినిమాను రూపొందించారు. మా అబ్బాయి హీరోగా నా కొడుకు బంగారం అనే చిత్రాన్ని జాన్బాబు గారి దర్శకత్వంలోనే చేయబోతున్నాం. అన్నారు. దర్శకుడు జాన్బాబు మాట్లాడుతూ.లండన్లో గ్రాఫిక్స్ పనులు జరగడంలో ఆలస్యమైంది. అందుకే చిత్రాన్ని కొద్ది జాప్యంతో విడుదల చేస్తున్నాం. అన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









