కమల నాధుల్లో కలవనున్న అలనాటి నటి
- March 11, 2018
విజయవాడ: ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత భారతీయ జనతా పార్టీలో ఆదివారం చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల స్ఫూర్తితో బీజేపీలో చేరానన్నారు. అలాగే నేను టీడీపీ నుంచి బయటకు రాలేదు... గెంటి వేయబడ్డాను అని కవిత అన్నారు. టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డానని, టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, చంద్రబాబును తిడుతున్నవారికి పదవులిచ్చారు... పార్టీ కోసం పనిచేసినవారికి మొండిచేయి చూపారని కవిత పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







