సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ, మాక్రన్

- March 12, 2018 , by Maagulf
సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ, మాక్రన్

మీర్జాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్‌లు ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో 75 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇది అతిపెద్ద సౌర విద్యుత్తు ప్లాంట్ కావడం విశేషం. నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మాక్రన్ ఇవాళ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సోలార్ పవర్ గెయింట్ ఇంజీ సోలార్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మీర్జాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ ప్రోగ్రామ్‌కు కింద చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com