ముక్కోణపు టీ 20 సిరీస్లో శ్రీలంక పై భారత్ ఘన విజయం
- March 12, 2018
ముక్కోణపు టీ 20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్నిభారత్ జట్టు మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా లంకేయులతో ఆరంభంలో ఎదురైన ఓటమి ప్రతీకారం తీర్చుకుంది.
భారత్ బ్యాటింగ్లో మనీష్ పాండే(42), దినేశ్ కార్తీక్(39)లు రాణించి విజయంలో సహకరించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఉనాద్కత్ వేసిన తొలి ఓవర్లోనే 15 పరుగుల్ని పిండుకుంది. అయితే ఆ తర్వాత ఓవర్లో వాషింగ్టన్ సుందర్ కుదరుగా బౌలింగ్ చేసి తొమ్మిది పరుగుల ఇవ్వగా, శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్లో గుణతిలకా(17) పెవిలియన్ చేరాడు.
ఆపై స్వల్ప వ్యవధిలో కుశాల్ పెరీరా(3)ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ పంపాడు. దాంతో లంక 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కాగా, కుశాల్ మెండిస్తో కలిసి మూడో వికెట్కు 62 పరుగులు జత చేసిన తర్వాత ఉపుల్ తరంగా(22) పెవిలియన్ చేరాడు. తిషారా పెరీరా(15), జీవన్ మెండిస్(1)లు అవుటైన కాసేపటికి కుశాల్ మెండిస్(55;38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. దాంతో శ్రీలంక స్కోరు బోర్డులో వేగం తగ్గింది.
చివరి వరుస ఆటగాళ్లలో షనకా(19) ఫర్వాలేదనిపించడంతో శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 152పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో మెరవగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు. ఇక చాహల్, విజయ్ శంకర్, ఉనాద్కత్లకు తలో వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









