దేశవ్యాప్తంగా 47 ఇండిగో విమానాలు రద్దు

- March 12, 2018 , by Maagulf
దేశవ్యాప్తంగా 47 ఇండిగో విమానాలు రద్దు

ముంబై : పౌర విమాన శాఖ కఠిన నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏ320నియోస్ విమానాలు గ్రౌండ్ అయ్యాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు ఉన్న విమానాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకస్మాత్తుగా నిర్ణయించింది. ఈ కారణంగా ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా 47 విమానాలను రద్దు చేసింది. గోఎయిర్‌కు సంబంధించిన మరో మూడు విమానాలను కూడా రద్దు చేశారు. 47 విమానాలను నిలిపేసినట్లు ఇండిగో ఇవాళ నత వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్, బెంగుళూర్, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్‌సర్, గౌహతిల నుంచి ప్రారంభం అయ్యే విమానాలను రద్దు చేశారు. సోమవారం అకస్మాత్తుగా ఇండిగో విమానం ఒకటి గాల్లోనే తీవ్ర వడిదిడుకులకు లోనైంది. దీంతో డీజీసీఏ తక్షణం అలాంటి విమానాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇంజిన్ సమస్యలు ఉన్న ఏ320నియో ప్లేన్లను ఫిబ్రవరిలోనే గ్రౌండ్ చేశారు. విమానాలను ల్యాండ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ ప్రతి రోజు సుమారు వెయ్యి సర్వీసులను నడుపుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com