ఇక టీడీపీకి గుడ్ బై : పవన్ కళ్యాణ్

- March 14, 2018 , by Maagulf
ఇక టీడీపీకి గుడ్ బై : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ తో తనకున్న మిత్ర బంధంకు గుడ్ బైచెప్పేశారు . గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై తమ పోరు మొదలైయిందని ప్రకటించారు.

టీడీపీ అవినీతికి అడ్డులేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మూడు మాటలు చెబితే.. అందులో ఆరు అబద్ధాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తయారుకావడం నాకు బాధగా ఉంది. తెలుగుదేశం నాయకులు తమ పాలనలో రాష్ట్రాన్ని కరప్షన్‌ ఆంధ్రగా మార్చారు. ఇక ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై మా పోరాట స్వరం వినిపిస్తాం' అని ఘాటు గా విమర్సించారు పవన్ కళ్యాణ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com