మార్చి 30న వయాంతి 'సామూహిక సూర్య నమస్కారం'
- March 15, 2018
మస్కట్: వయాంతి యోగా, ఎనిమిదేళ్ళ నుంచి ఆపై వయసున్నవారందరితో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాన్ని మార్చి 30న నిర్వహించబోతున్నారు. సాంగ్రి లా బర్ అల్ జిస్సాలోని యాంఫీ థియేటర్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 108 సూర్య నమస్కారాల్ని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ప్రేమ్ నగేష్ నేతృత్వంలో వయాంతీ యోగా సంస్థ నడుస్తోంది. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వమిస్తున్నారు. ఒమన్లో క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాకి చెందిన 99 ఏళ్ళ యోగా టీచర్ నానమ్మాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నానమ్మాల్ ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.మార్చి 17 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఈ కార్యక్రమంలో పార్టిపిపేట్ చేసే అవకాశముంటుంది. మొదటగా వచ్చిన 500 మందికి యోగా మ్యాట్, టీ షర్ట్ అందజేస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







