మార్చి 30న వయాంతి 'సామూహిక సూర్య నమస్కారం'
- March 15, 2018
మస్కట్: వయాంతి యోగా, ఎనిమిదేళ్ళ నుంచి ఆపై వయసున్నవారందరితో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాన్ని మార్చి 30న నిర్వహించబోతున్నారు. సాంగ్రి లా బర్ అల్ జిస్సాలోని యాంఫీ థియేటర్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 108 సూర్య నమస్కారాల్ని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ప్రేమ్ నగేష్ నేతృత్వంలో వయాంతీ యోగా సంస్థ నడుస్తోంది. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వమిస్తున్నారు. ఒమన్లో క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాకి చెందిన 99 ఏళ్ళ యోగా టీచర్ నానమ్మాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నానమ్మాల్ ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.మార్చి 17 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఈ కార్యక్రమంలో పార్టిపిపేట్ చేసే అవకాశముంటుంది. మొదటగా వచ్చిన 500 మందికి యోగా మ్యాట్, టీ షర్ట్ అందజేస్తారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







