బ్రెజిల్‌లో ఎల్లో ఫీవర్‌తో 300మంది మృతి

- March 17, 2018 , by Maagulf
బ్రెజిల్‌లో ఎల్లో ఫీవర్‌తో 300మంది మృతి

గత జులై నుండి ఇప్పటివరకు ఎల్లో ఫీవర్‌తో 300 మంది మరణించారని బ్రెజిల్‌ ధృవీకరించింది. మొత్తంగా ఈ ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి 920 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొంది. ఎల్లో ఫీవర్‌ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు అత్యవసర పరిస్థితి విధించలేదు. అంతకుముందు ఎమర్జన్సీ విధించారు. జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో వైరస్‌ బాగా ప్రబలంగా వుండడంతో ఇన్ఫెక్షన్లు పెరిగాయని, అందుకే ఎమర్జన్సీ విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని శావోపాలో, రియో డీ జెనీరో, మినాస్‌ గెరాస్‌ వంటి జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లోనే ఈ మరణాలు సంభవించాయి. కాగా, ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లోని కోటీ 78లక్షల మందికి ఈ వ్యాధి రాకుండా టీకాలు వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com