మామిడికాయ పులిహోర
- March 17, 2018
కావలసినవి:
బియ్యం- ఒక కప్పు, పచ్చిమామిడికాయ తరుగు- ఒక కప్పు, ఉప్పు-తగినంత, పసుపు-1/8 టీస్పూను.
తాలింపు కోసం:
నువ్వులనూనె- మూడు టేబుల్స్పూన్లు, ఆవాలు- అర టీస్పూను, మినపప్పు-రెండు టీస్పూన్లు, శెనగపప్పు- ఒక టేబుల్స్పూను, కరివేపాకు-గుప్పెడు, ఇంగువ-చిటికెడు, అల్లం- చిన్నముక్క (తరిగి), పల్లీలు-మూడు టేబుల్స్పూన్లు, పచ్చిమిర్చి-మూడు (సన్నగా, పొడుగ్గా తరిగి), ఎండుమిర్చి- మూడు.
తయారీవిధానం:
బియ్యంలో సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికిన అన్నాన్ని పెద్ద పళ్లెంలో పోసి పైన ఒక టీస్పూను నువ్వుల నూనె చల్లాలి. పల్లీలను నూనె వేయకుండా వేగించి పొట్టు తీసేయాలి. కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు మినపప్పు, శెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పల్లీలు వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం తరుగు కూడా వేసి కొంచెంసేపు వేగించాలి. ఆ తర్వాత పసుపు, మామిడి తరుగును వేసి మూడు నిమిషాలు గరిటెతో అటు ఇటు తిప్పాలి. ఆ తరువాత ఉప్పు వేయాలి. ఈ తాలింపును అన్నంలో వేసి అంతా బాగా కలిసేలా కలపాలి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







