30 వేల కార్మికులకు రిక్రూట్మెంట్ ఫీజును తిరిగి చెల్లింపు:స్వాగింతించిన గ్లోబల్ ట్రేడ్ యూనియన�
- March 18, 2018
వియన్నా: ప్రపంచ కప్ సౌకర్యాల నిర్మాణంలో పనిచేస్తున్న 30,000 మంది వలస కార్మికుల వద్ద నుంచి తీసుకొన్న రిక్రూట్మెంట్ ఫీజులను తిరిగి చెల్లించటానికి కతర్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ (ఐటియుసి) స్వాగతించింది. ఆ సమావేశం తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ ఆసియా దేశాల నుంచి 5,500 మందికి పైగా ప్రజలకు (శ్రామికశక్తిలో మూడింట ఒకవంతు) మార్చి చివరి నాటికి అందనుంది. కతర్ లో పనిచేయడానికి ఆయా కార్మికులను నియమించిన మధ్యవర్తులకు చెల్లించిన డబ్బును తిరిగి ఇపుడు పొందుతారు. అదేవిధంగా మిగిలిన కార్మికులకు ఆ ఫీజును పునరుద్ధరించడానికి దోహా పలువురు మధ్యవర్తులుతో ఇటీవల చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ (ఐటియుసి) తెలిపింది. మొత్తం 30,000 మందికి ఆ మొత్తం 2019 నాటికి అందవచ్చని భావిస్తున్నారు. ఆ డబ్బు మొత్తం 3.6 మిలియన్ పౌండ్ల వరకు చేరుకోవచ్చని అన్నారు. ఎంప్లాయిమెంట్ ఫీజులు (ఉపాధి రుసుములు) కతర్ కు ఈ వ్యవహారం బాధించే సంగతి అయినప్పటికీ మానవ హక్కులను కతర్ లో మరింతగా మెరుగుపరచడానికి సుప్రీం కమిటీ డెలివరీ మరియు లెగసీ యొక్క ప్రయత్నాల్లో భాగంగా ఉంది, ఈ సందర్భంలో కార్మికులు విదేశాల్లో పనిచేయడానికి తమ స్వదేశంలో మధ్యవర్తులకు డబ్బు చెల్లించాలనే సంస్కృతికి కతర్ ప్రణాళికల్లో భాగంగాఆ తరహా దుర్వినియోగం ముగించడానికి చర్యలు తీసుకోనుంది. తమ ఉద్యోగాలను పొందే కాలంలో కార్మికులు కాంట్రాక్టర్లకు చెల్లించిన డబ్బును తిరిగి చెల్లించేవారు. కరాచీతో సహా అనేక దేశాలలో వలస కార్మికుల వద్ద వసూలు చేసిన రిక్రూట్మెంట్ ఫీజులు ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఈ విషయమై " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధి తో ఆదివారం అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి షరాన్ బురో మాట్లాడుతూ," వలస కార్మికుల నియామక ప్రక్రియను సంస్కరించడం తద్వారా వారు ఉద్యోగాలను మరియు వేతనాల జరుగుతున్న అన్యాయాలు చట్టవిరుద్ధమైన రిక్రూట్మెంట్ ఫీజును తిరిగి ఆ కార్మికులు పొందడానికి మరియు వలస కార్మికులను రుణ బానిసత్వానికి మారేలా చేస్తాయి, ఇది ప్రపంచ సవాలుగా ఉందిని ' ఆమె పేర్కొంది. రిక్రూట్మెంట్ ఫీజులు వసూలు చేయడం కతర్ లో కఠిన నిషేధం అమలులో ఉందని ఆమె చెబుతూ కతర్ లో కొనసాగుతున్న కార్మిక సంస్కరణల్లో భాగంగా ఇది ఒక సానుకూల చర్యని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







