శ్రీదెవికి స్థానాన్ని మాధురి దీక్షిత్ భర్తీ చేస్తుంది: శ్రీదెవి తనయ జహ్నవి
- March 20, 2018శ్రీదేవిని దేశమే మర్చిపోలేక పోతోంది ఇంకా! మరి కుటుంబం మరవటం చాలా కష్టం. అయితే కాలం మాత్రమే ఎంతటి పెద్ద గాయాల్ని అయినా మానుపుతుందని అటారు.
అయితే ప్రస్తుతానికి మాత్రం శ్రీదేవి మరణం నుండి ఆ ఙ్జాపకాల నుండి పూర్తిగా కోలుకోలేకపోతుంది కూతురు జాహ్నవి. శ్రీదేవి హఠాన్మరణంతో ఒక్క సారిగా మూగపోయిన జాహ్నవి తన తల్లిని స్మరించని క్షణం లేదట. దానికి ఋజువు ఆమె ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగం తో చేసిన పోస్ట్ లే.
బోనీ కపూర్ తో వివాహనంతరం చిత్ర సీమకు వీడ్కోలు చెప్పేసిన శ్రీదేవి, "ఇంగ్లీష్ వింగ్లీష్" సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె ఆఖరు సినిమా "మామ్" లో నటించారు శ్రీదేవి. ఈ రెండు సినిమాలతోనే తన పూర్వవైభవాన్ని తిరిగి అందిపుచ్చుకున్న శ్రీదేవితో వరుస చిత్రాలను చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు "క్యూ" లో నిలబడ్డారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఒక చిత్రంలో శ్రీదేవి నటిచాల్సి ఉండగా, శ్రీదేవి మరణంతో ఆ స్థానాన్ని మాధురి దీక్షిత్తో భర్తీ చేయాలని నిర్ణయించారు ఆయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ "ఇన్స్టాగ్రామ్" లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్టు చేసింది కూతురు జాహ్నవి. కరణ్ జోహార్ నిర్మాణసారధ్యంలో అభిషేక్ వర్మన్ (2 స్టేట్ ఫేం) తెరకెక్కిస్తున్న తాజా చిత్ర కథ అమ్మ హృదయానకి హత్తుకుంది. "చాలా వరకూ అమ్మను గుర్తుచేస్తుంది ఈ చిత్రం. ఈ అందమైన చిత్రంలో భాగం కాబోతున్న మాధురిజీ కి - డాడీ, ఖుషీ, నా తరుపున చాలా కృతఙ్జతలు" అంటూ మాధురి దీక్షిత్, శ్రీదేవి కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది జాహ్నవి. ప్రస్తుతం జాహ్నవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్గా మారింది. అమ్మ అమ్మే కదా! మరపు చాలా అసాధ్యం. అయితే నాడు శ్రీదేవికి చిత్రసీమలో సరైన పోటీ మధురి మాత్రమే. అయినా ఇద్దరు మంచి స్నేహితులు. బహుశ మాధురి ఆ సినిమాకు న్యాయం చేసి శ్రీదేవికి మరోసారి మన స్మృతిపథం లోకి తెస్తుందెమో! అయితే ఆ సినిమా పేరు "షిదాత్" అంటే "ఇష్టంగా నిరీక్షించటం" .
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్