చిన్నారి కిడ్నాప్: బహ్రెయినీ వ్యక్తికి 12 1/2 ఏళ్ళ జైలు శిక్ష
- March 22, 2018
మనామా: బహ్రెయిన్కి చెందిన ఓ వ్యక్తికి న్యాయస్థానం పన్నెండున్నరేళ్ళ జైలు శిక్ష విధించింది. 2016లో జరిగిన కిడ్నాప్ ఘటనకు సంబంధించి న్యాయస్థానం నిందితుడ్ని దోషిగా నిర్ధారించి, ఈ శిక్ష ఖరారు చేసింది. నిందితుడిపై కిడ్నాప్, సెక్సువల్ హరాష్మెంట్, పోలీసులపై దాడి, దొంగతనం, డ్రగ్స్ అబ్యూజ్ తదితర అభియోగాలు మోపబడి, నిరూపించబడ్డాయి. ఆగస్ట్ 2న హూరాలోని ఓ కమర్షియల్ రోడ్డులో ఈ దొంగతనం జరిగింది. సారా అనే చిన్నారి తల్లిదండ్రులు, కారులో తమ చిన్నారిని వదిలి, పక్కనే వున్న ఓ షాప్లోకి వెళ్ళగా, నిందితుడు ఆ కారుని దొంగిలించాడు. ఈ ఘటన బహ్రెయిన్ సమాజాన్ని షాక్కి గురిచేసింది. సోషల్ మీడియాలో సారా కోసం పెద్ద స్థాయిలో ఉద్యమమే జరిగింది. భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బహ్రెయిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి సెంట్రల్ మనామాలోని ఓ ఫ్లాట్లో తన ప్రియురాలితో కలిసి నిందితుడు వుండగా అతన్ని అరెస్ట్ చేశారు. బాలిక సారాను రక్షించారు. బహ్రెయిన్ ప్రభుత్వం చూపిన చొరవను భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అభినందించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







