పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న శంషాబాద్ విమానాశ్రయం
- March 23, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయం పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. ఈ పదేళ్లలో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, కొత్త కొత్త పాలసీలతో వారికి మరింత చేరువవుతోంది.. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్టుగా అవతరించింది శంషాబాద్ విమానాశ్రయం. ఈ నేపథ్యంలో పదేళ్ల సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు జీఎంఆర్ యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వార్షికోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఆసియాలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా దీనిని నిర్మించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో 30 నెలల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది జీఎంఆర్ సంస్థ. 12 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా నిర్మాణం చేపట్టింది. ఈ పదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా చేరింది. ఎయిర్పోర్టు అవసరాల కోసం స్వయంగా ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను సైతం నెలకొల్పారు. దేశంలోనే తొలిసారిగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తూ ఈ-బోర్డింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ గత ఏడాది ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరగడంతో అందుకు తగ్గట్టుగా ఎయిర్పోర్టును విస్తరిస్తున్నారు. విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు పలువురు మంత్రులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









