డ్రగ్స్‌ ప్రమోషన్‌: నిందితుడిపై విచారణ

- March 23, 2018 , by Maagulf
డ్రగ్స్‌ ప్రమోషన్‌: నిందితుడిపై విచారణ

దుబాయ్:29 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఇద్దరు మహిళల ద్వారా క్రిస్టల్‌ మిత్‌ని సరఫరా చేస్తున్న అభియోగాల మేరకు విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు మహిళలకు డ్రగ్స్‌ అలవాటు చేయడం, డ్రగ్స్‌తో పాటు కారులో పట్టుబడటం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. జనవరి 16న బుర్‌ దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. న్యాయస్థానంలో పోలీస్‌ క్రైమ్‌ ల్యాబ్‌ ఆధారాల్ని సమర్పించింది. యాంఫిటమెన్‌, డ్రగ్‌ టూల్స్‌, 4.52 గ్రాముల హాషిష్‌, 659 యాంఫిటమైన్‌ ట్యాబ్లెట్లు, పెద్ద మొత్తంలో యాంఫిటమైన్‌ వైట్‌ పౌడర్‌ని సాక్ష్యాలుగా పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 19న ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com