అమెరికాలో 'నా పేరు సూర్య' ఆటా పాట..
- March 23, 2018
అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా) చిత్రం కోసం ఓ రొమాంటిక్ పాటను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్తో పాటు కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ పై ఈ పాటను తీస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరిస్తున్న పాట పూర్తికాగానే చిత్రబృందం తిరిగి హైదరాబాద్ చేరుకుని ఓ ప్రత్యేక పాటను తీయనుంది. ఈ పాటను అల్లు అర్జున్, బాలీవుడ్ భామ ఎలీ అవరమ్పై చిత్రీకరించనున్నట్లు సమాచారం. సందేశంతో కూడుకున్న చక్కటి సాహిత్యంతో ఈ పాట ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ సోల్జర్ (సైనికుడు)గా తన అద్వితీయమైన నటనను ఈ చిత్రంలో ప్రదర్శించారని, ఆయనపై తీసిన ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత లగడపాటి శ్రీధర్ వెల్లడించారు. ఏప్రిల్లో ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహించి, మే 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్కుమార్ తదితరులు నటిస్తుండగా, సినిమాటోగ్రఫీని రాజీవ్ రవి, ఎడిటింగ్ను కోటగిరి వెంకటేశ్వరరావును అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బన్ని వాసు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







