నందు ''ఇంతలో ఎన్నెన్ని వింతలో'' ఏప్రిల్ 6న విడుదల..
- March 24, 2018
హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'. ఈ చిత్రానికి హీరో హీరోయిన్స్ నందు, సౌమ్య వేంగోపాల్, పూజ రామచంద్రన్ కాగా దర్శకుడు వరప్రసాద్ వరికూటి. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 6న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యం లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్బంగా నిర్మాత రామమోహన రావు మాట్లాడుతూ ఇటీవలే ఈ చిత్ర పాటలు ఎఫ్ ఎమ్ ద్వారా విడుదలయ్యాయి.. 3పాటలను అందరూ అభినందిస్తున్నారు.. నలుగురి మధ్య ఉత్కంఠభరితంగా సాగే కథ... సినిమా చాలా బాగొచ్చింది.. ఆడియోన్స్ కు ఫ్రెష్ గా ఫీల్ కలుగుతుంది అన్నారు. అనంతరం దర్శకుడు వరప్రసాద్ వరికూటి మాట్లాడుతూ ఇది నా మొదటి చిత్రం. సినిమా మొదలు పెట్టినప్పుడు ఎలాంటి కాంఫిడెన్స్ తో అయితే ఉన్నామో అదే కాంఫిడెన్స్ తో ఇప్పటికీ వున్నాము. కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రం లో హైలెట్స్ గా నిలబడతాయి. ఆరోగ్యకరమైన గార్డెన్ నుంచి ఒక ఫ్రూట్ బయటకు వస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫ్రెష్ ఫీల్ ను సినిమా చూస్తున్నప్రేక్షకులు అనుభవిస్తారు ... నాకు మంచి ప్రొడక్షన్ దొరికింది.. వెల్ టెక్నీషియన్స్ తో పాటు పవర్ ఫుల్ ఆర్టిస్ట్స్ ను నాకు అందించారు నిర్మాతలు.. ప్రేక్షకునికి కావాల్సినవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని అందుకేతప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా అన్నారు.
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్, గగన్ విహారి, ఆర్ కె, మీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్ మోహన్ రెడ్డి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, సంగీతం: యాజమాన్య, మాటలు: కె వి రాజమహి, మధు శ్రీనివాస్ గోపాలుని, కొరియోగ్రఫీ: విఘ్నేశ్వర, లిరిక్స్: సురేష్ ఉపాద్యాయ, ఆర్ట్ : జిల్లా మోహన్, స్టంట్స్: మార్షల్ రమణ, పి ఆర్వో: కడలి రాంబాబు, సహ నిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం : వర ప్రసాద్ వరకూటి
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







