ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థ వేడుక
- March 25, 2018
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడి నిశ్చితార్థం శనివారం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఆకాశ్ అంబానీ(25) డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజీ బ్లూ ఫౌండేషన్లో శ్లోకా మెహతా డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడ్డారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్ లవ్ ప్రపోజల్ను శ్లోకా అంగీకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!