తెలుగు మాట్లాడితే జీతం కట్..!

- March 26, 2018 , by Maagulf
తెలుగు మాట్లాడితే జీతం కట్..!

స్కూల్ ఆవరణలో తెలుగు మాట్లాడితే వేతనం కట్ చేస్తామంటూ కరీంనగర్ జిల్లాలో మెమో జారీ అయింది. గురుకుల స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థులతో మొత్తంగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలంటూ నోటీసులు జారీ చేశారు. అది కూడా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదు. ఫ్లూయెంట్‌గా ఉంటేనే వేతనం వస్తుంది. ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని వారు సెలవుపై వెళ్లాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాలంటూ ఉపాధ్యాయాలను హెచ్చరించారు ఉన్నతాధికారులు. ఈ మేరకు లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడడం కలకలం సృష్టిస్తోంది. 

ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికే ఇలాంటి నోటీసు ఇవ్వాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నోటీసుతో ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చిన టీచర్లు భయపడిపోతున్నారు. రీజినల్ కో ఆర్డినేటర్లు స్కూళ్లలో తనిఖీలకు వస్తున్నారంటేనే వణికిపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com