పార్టీలో జనాలపైకి దూసుకెళ్లిన కారు..23మంది మృతి

- March 26, 2018 , by Maagulf
పార్టీలో జనాలపైకి దూసుకెళ్లిన కారు..23మంది మృతి

దక్షిణాఫ్రికా లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు వేగంగా దూసుకెళ్లడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌతర్న్‌ ఆఫ్రికాలోని మొజాంబికాలోని మాపుటో అనే ప్రాంతంలో ఆదివారం పెద్ద సంఖ్యలో పార్టీకి హాజరయ్యారు. అదే సమయంలో వాయువేగంతో దూసుకొచ్చిన కారు కాస్త సరాసరి పార్టీలో ఉన్న జనాలపైకి వెళ్లింది.. దీంతో 23మంది అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం కారును ఆపాలని ఆదేశాలు ఇచ్చానా ఆ డ్రైవర్‌ నిర్లక్ష్యం చేశాడని తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com