సింగపూర్లో ఉగాది కల్చరల్ నైట్
- March 26, 2018
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది కల్చరల్ నైట్ను భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 31 శనివారం సాయంత్రం కల్లాంగ్ థియేటర్, వన్ స్టేడియం వాక్లో జరిగే ఈ మెగా ఈవెంట్కు భారీ ఎత్తున స్థానిక తెలుగు ప్రజలు హాజరవ్వాలని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమానికి, యాంకర్ శ్యామల, సింగర్స్ సత్య యామిని, అనుదీప్, ప్రవీణ్ కుమార్, వీఆర్ లక్ష్మీ ధూలిపాళ్లలు, కమేడియన్స్ మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్, తాగుబోతు రాజమౌళి, డ్యాన్సర్స్ ఆట సందీప్ టీమ్తో పాటు ఢీ ఫేమ్ ప్రియాంకలు హాజరుకానున్నారు. ఉగాది కల్చరల్ నైట్ 2018ను విజయవంతం చేయడానికి అహర్నిశలూ కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు సత్య చిర్ల, సత్య సూరిశెట్టి, జ్యోతేశ్వర్, నాగేష్, వినయ్, రామ్, అనిల్, ప్రదీప్లకు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ను సందర్శించండి. goo.gl/wQRjyG
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









