టుస్సాడ్‌లో కోహ్లీ మైనపు బొమ్మ

- March 28, 2018 , by Maagulf
టుస్సాడ్‌లో కోహ్లీ మైనపు బొమ్మ

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైనపు బమ్మను న్యూఢిల్లీలో మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారుల జాబితాలోకి కోహ్లీ చేరనున్నారు. తన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండంపై కోహ్లీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని, తాను జీవితకాలం ఈ జ్ఞాపకాలను పదిలపర్చుకుంటానని పేర్కొంటూ టుస్సాడ్‌ కోహ్లీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మైనపు బొమ్మ ఏర్పాటు కోసం లండన్‌కు చెందిన టుస్సాడ్‌ నిపుణులు కోహ్లీని కలిసి 200 విధాలుగా ప్రత్యేమైన కొలతలు తీసుకుని వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com