ఇంటర్నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్
- March 28, 2018
దుబాయ్:దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ 'వీమెటా' టీమ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న మినా అసాలమ్ మదినాత్ జుమైరాలో జరగనుంది. ఐడబ్ల్యుఇపి ఛైర్పర్సన్ ఆరుషి ని షాంక్ నేతృత్వంలో దీన్ని నిర్వహిస్తారు. ఆరుషి, ప్రముఖ కథక్ కళాకారిణి మాత్రమే కాదు, ప్రముఖ సోషల్ వర్కర్ కూడా. భారతదేశంలోని ఉత్తరాఖండ్కి చెందినవారు ఈమె. దుబాయ్ చాప్టర్ 2018, వందనా శ్రీవాస్తవ నేతృత్వంలో డిజైన్ చేయబడింది. ఈ వేదికపై పలు ముఖ్యమైన అంశాల గురించిన చర్చ జరుగుతుంది. విమెన్ ఎంపవర్మెంట్ గురించి వక్తలు తమ అభిప్రాయాల్ని ఈ వేదికపై వెల్లడిస్తారు. కెనడియన్ పార్లమెంటేరియన్ డాక్టర్ రుబీ ధల్లా, అలాగే భారతదేశానికి చెందిన పలువురు మంత్రులు, యూఏఈకి చెందిన రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. స్త్రీ శక్తి కాన్సెప్ట్ నేపథ్యంలో ఆరుషి నాట్య ప్రదర్శన ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానుంది. ఎస్వికె మీడియా ఈ ఈవెంట్ని నిర్వహించనుంది. ప్రముఖ మహిళా యాక్టివిస్టులు, సోషలిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, ఆథర్స్, ప్రొఫెషనల్స్, ఆర్టిస్టులకు ఈ వేదికపై ఘన సన్మానం జరుగుతుంది. 



తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









