మళ్ళీ వస్తానని అనుకోలేదు : మలాలా
- March 29, 2018
ఇస్లామాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ కళ్ళ నుంచి గురువారం ఆనంద బాష్పాలు జలజలా స్రవించాయి. ఆమె అనూహ్యంగా తన స్వదేశానికి వచ్చి ప్రధానమంత్రి షాహిద్ కకన్ అబ్బాసీని కలిశారు. అనంతరం ఆమె అమితానందంతో మీడియాతో మాట్లాడారు. తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఐదేళ్ళ నుంచి తాను స్వదేశానికి తిరిగి రావడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
బాలల విద్య కోసం తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. పాకిస్థాన్లో బాలికా విద్య కోసం మలాలా ఫండ్ 6 మిలియన్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందన్నారు. రాబోయే తరాలే పాకిస్థాన్ భవిష్యత్తు అని చెప్పారు.
ఆరేళ్ళపాటు లండన్లో నివసించిన మలాలా తిరిగి తన స్వదేశానికి బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వచ్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







