మళ్ళీ వస్తానని అనుకోలేదు : మలాలా
- March 29, 2018
ఇస్లామాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ కళ్ళ నుంచి గురువారం ఆనంద బాష్పాలు జలజలా స్రవించాయి. ఆమె అనూహ్యంగా తన స్వదేశానికి వచ్చి ప్రధానమంత్రి షాహిద్ కకన్ అబ్బాసీని కలిశారు. అనంతరం ఆమె అమితానందంతో మీడియాతో మాట్లాడారు. తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఐదేళ్ళ నుంచి తాను స్వదేశానికి తిరిగి రావడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
బాలల విద్య కోసం తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. పాకిస్థాన్లో బాలికా విద్య కోసం మలాలా ఫండ్ 6 మిలియన్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందన్నారు. రాబోయే తరాలే పాకిస్థాన్ భవిష్యత్తు అని చెప్పారు.
ఆరేళ్ళపాటు లండన్లో నివసించిన మలాలా తిరిగి తన స్వదేశానికి బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









