మళ్ళీ వస్తానని అనుకోలేదు : మలాలా
- March 29, 2018
ఇస్లామాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ కళ్ళ నుంచి గురువారం ఆనంద బాష్పాలు జలజలా స్రవించాయి. ఆమె అనూహ్యంగా తన స్వదేశానికి వచ్చి ప్రధానమంత్రి షాహిద్ కకన్ అబ్బాసీని కలిశారు. అనంతరం ఆమె అమితానందంతో మీడియాతో మాట్లాడారు. తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఐదేళ్ళ నుంచి తాను స్వదేశానికి తిరిగి రావడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
బాలల విద్య కోసం తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. పాకిస్థాన్లో బాలికా విద్య కోసం మలాలా ఫండ్ 6 మిలియన్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందన్నారు. రాబోయే తరాలే పాకిస్థాన్ భవిష్యత్తు అని చెప్పారు.
ఆరేళ్ళపాటు లండన్లో నివసించిన మలాలా తిరిగి తన స్వదేశానికి బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









