'టైమ్స్' అత్యంత ప్రభావశీలురు ఎవరో చూడండి
- March 29, 2018
న్యూయార్క్: ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ ఏటా విడుదల చేసే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు మరోసారి పరిశీలనకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రభావితం చేసే ప్రముఖ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణలతో ఏటా ప్రభావశీలుర జాబితాను విడుదల చేస్తుంటుంది టైమ్స్ మ్యాగజైన్. ఏప్రిల్లో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఇందుకు గానూ మోదీ సహా పలువురు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ప్రభావశీలుల జాబితాలో చోటు కోసం మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, బ్రిటన్ రాజ కుటుంబీకులు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్, ప్రిన్స్ హ్యారీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు పోటీ పడుతున్నారు.
2015, 2016, 2017లో విడుదల చేసిన ప్రభావశీలుల జాబితాలోనూ ప్రధాని మోదీ స్థానం సంపాదించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









