'టైమ్స్' అత్యంత ప్రభావశీలురు ఎవరో చూడండి
- March 29, 2018
న్యూయార్క్: ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ ఏటా విడుదల చేసే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు మరోసారి పరిశీలనకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రభావితం చేసే ప్రముఖ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణలతో ఏటా ప్రభావశీలుర జాబితాను విడుదల చేస్తుంటుంది టైమ్స్ మ్యాగజైన్. ఏప్రిల్లో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఇందుకు గానూ మోదీ సహా పలువురు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ప్రభావశీలుల జాబితాలో చోటు కోసం మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, బ్రిటన్ రాజ కుటుంబీకులు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్, ప్రిన్స్ హ్యారీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు పోటీ పడుతున్నారు.
2015, 2016, 2017లో విడుదల చేసిన ప్రభావశీలుల జాబితాలోనూ ప్రధాని మోదీ స్థానం సంపాదించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









