మనామా:వలసదారుడి రీపాట్రియేషన్ కోసం విజ్ఞప్తి
- March 29, 2018మనామా: సోషల్ వర్కర్స్, ఇండియన్ మిషన్ సాయాన్ని కోరారు ఓ వలసదారుడ్ని రీపాట్రియేట్ చేయడం కోసం. మనామాలో గత ఐదేళ్ళుగా మంచానికే పరిమితమయిపోయాడు 78 ఏళ్ళ నలరాజన్. కేరళకు చెందిన నలరాజన్, కంటి చూపును సైతం కోల్పోయారు. గుడైబియాలోని ఓ ఇంట్లో స్నేహితుల సహాయంతో బతుకును వెల్లదీస్తున్నాడాయన. బేకరీలో మొదట్లో పనిచేసేవాడాయన. 2011 నుంచి సమస్యలు అతనికి ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని చూసే అవకాశం దొరుకుతుందని ఎదురుచూస్తున్నాననీ, ఎంబసీ మాత్రమే తనకు సాయం చేయగలదని నలరాజన్ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..