మక్కా పేలుళ్ల నిందితులు చర్లపల్లి జైలుకు
- March 30, 2018
హైదరాబాద్: భద్రతా కారణాల వల్ల చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మక్కా పేలుళ్ల నిందితులను శుక్రవారం కోర్టు అనుమతితో అధికారులు చర్లపల్లి జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు. అజ్మీర్ బాంబు పేలుళ్ల కేసులో జైపూర్ జైలులో ఉన్న మక్కా పేలుళ్ల నిందితులు దేవేంద్రగుప్త, లోకేష్ శర్మ, రాజేష్ చౌదరిని కోర్టు కేసుల విచారణ నిమిత్తం ఈ నెల 28న ఎన్ఐఏ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది యువకులు చంచల్గూడ జైలులో ఉండడంతో ఇబ్బందులు తలెత్తే ఆవకాశం ఉందని జైలువర్గాలు భావించి ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మక్కా పేలుళ్ల నిందితులను కోర్టు అనుమతితో చర్లపల్లి జైలుకు తరలించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







