టీ20 చరిత్రలో రికార్డు స్కోర్..

- March 31, 2018 , by Maagulf
టీ20 చరిత్రలో రికార్డు స్కోర్..

ముక్కోణపు మహిళా టీ20 సిరీస్ లో ఆసీస్ పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మహిళల టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీమ్ గా ఆసీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా (205) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును (209) సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ కు దిగిన ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 210 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 11.3 ఓవర్లలో 96 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొతం చేసుకుంది. కాగా ఈ సిరీస్ ను గెలవడంతో ఆస్ట్రేలియా గత మూడేళ్ళలో మొదటి సిరీస్ ను గెలుచుకున్నట్లయింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com