కౌలంపూర్:తెలుగువారికి అండగా శాంతిప్రియ..

- March 31, 2018 , by Maagulf
కౌలంపూర్:తెలుగువారికి అండగా శాంతిప్రియ..

ఢిల్లీ : మలేసియా రాజధాని కౌలాంపూర్ లో తెలుగు వారి పక్షాల శాంతిప్రియ అనే మహిళ పోరాడుతోంది. శాంతిప్రియ సహకారంతో వందలాదిమంది తెలుగువారు విముక్తి పొందుతున్నారు. ఉపాధి కోసం మలేసియా వెళ్లాలనుకునేవారిపై మోసగాళ్లు వలపన్ని మనుషులను రవాణా చేసే ముఠాలుగా తయారయి వేలాది రూపాయలను దండుకుంటున్నారు. మోసం చేసినవారిని కౌలాలంపూర్ లోని పలు సంస్థల్లో పనికి కుదురుస్తు డబ్బులు దండుకుంటున్నారు. వీరి వలలో చిక్కి తెలుగువారు బానిసలుగా మారుతున్నారు. పనిలో చేరింది మొదలు వారికి యజమానులు నరకం చూపిస్తున్నారు. దీంతో మలేషియాలో తెలుగువారి కష్టాలు వర్ణనాతీతంగా వున్నాయి. చేతిలో చిల్లి గవ్వ లేక స్వదేశం వచ్చే దారి లేక నానా తెలుగు వారు అవస్థలు గురవుతున్నారు. అటువంటివారికి అండగా కాంగ్రెస్ అనుబంధ గల్ఫ్ ఎన్ ఆర్ఐ విభాగం ఇప్పటికే అనేకమంది తెలుగువారికి అండగా నిలిచి విముక్తి కలిగించింది. కౌలాలంపూర్ లో బాధితుల పక్షాల నిలిచి శాంతిప్రియ పనిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com