కొనసాగుతున్న భారత్ బంద్ !
- April 01, 2018ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలంటూ దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో బీహార్, పంజాబ్, యూపీ, ఒడిషాలో ఉదయం నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. గుంపులుగా రోడ్లపైకి వచ్చిన దళిత సంఘాలు బలవంతంగా షాపులు మూయించారు.
పంజాబ్లో లుథియానా, జిర్కాపూర్ ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాలను మోహరించారు. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు.
పాట్నాలో జన అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ దళిత సంఘాలకు మద్దతు ప్రకటించారు. తన కార్యకర్తలతో సహా రోడ్డుపైకి వచ్చి భారీ ర్యాలీ చేశారు. దళిత సంఘాలతో కలిసి రాస్తారోకో, రైల్ రోకో చేశారు. భారత్ బంద్ కారణంగా చాలా ప్రాంతాల్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్