కామన్‌వెల్త్‌ నిర్వాహకులపై సీరియస్‌ అయిన సైనా

- April 02, 2018 , by Maagulf
కామన్‌వెల్త్‌ నిర్వాహకులపై సీరియస్‌ అయిన సైనా

న్యూఢిల్లీ : ప్రముఖ షెటిల్‌ క్రీడాకారిణి సైనా సెహ్వాల్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జట్టు అధికారిగా తన తండ్రిని తనతోపాటు కామన్‌వెల్త్‌ క్రీడాగ్రామంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు తాము భారత్‌ నుండి వచ్చామని, టీమ్‌ అధికారిగా ఆమె తండ్రిని అధికారికంగా ధ్రువీకరించడంతో తానే ఖర్చులన్నీ భరించానన్నారు. క్రీడాగ్రామానికి వచ్చాక ఆమె తండ్రిపేరును టీమ్‌ అధికారి క్యాటగిరీ నుంచి తొలగించడంతో ట్విటర్‌లో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో బుధవారం నుండి కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు గణనీయమైన పతకాలు సాధిస్తారని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com