సమయం పడుతుంది అంటున్న ఫేస్ బుక్ అధినేత
- April 03, 2018
ఫేస్ బుక్ లో సమస్యలను సరిచేయడానికి కొన్నేళ్లు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మార్క్ జకెర్ బర్గ్ అన్నారు. ఫేస్ బుక్ లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలైటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్ బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. పలు కోర్టుల్లో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వోక్స్ అనే మీడియా సంస్థతో జుకెర్ బర్గ్ మాట్లాడారు. ''ఈ లోపాలను సవరించగలం. కానీ కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ సమస్యలను మూడు లేదా ఆరు నెలల్లోపే సరిచేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ, వాస్తవం ఏమిటంటే ఇంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది'' అని జుకెర్ బర్గ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









