మానవులందరికీ హెచ్చరిక!
- May 06, 2015
నేపాల్ లోని ఖాట్మండు ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం కొన్నివేల ప్రాణాలను బలిగొన్నది. మరొక మారు నిద్రావస్థలో ఉన్న ప్రపంచాన్ని దేవుడు ఒక్కసారి తట్టిలేపాడు, ఈ క్రింది విధంగా అందరికీ హెచ్చరిక జారీ చేసాడు:
"నేను మానవ జాతిని సృష్టించాను. కొన్ని పరిమితులను, హద్దులను నిర్దేశించాను. మీరు వీటికి 'మానవతావిలువలు' అని పేరు పెట్టారు. నేను మిమ్మల్ని సృష్టిస్తే, మీరు డబ్బుని కనిపెట్టారు.నా దృష్టిలో అందరూ సమానమైతే మీ దృష్టిలో అశాశ్వతమైన 'డబ్బు'ని సంపాదించడంలో మానవతావిలువలకు తిలోదకాలిచ్చి, అశాశ్వతమైన సుఖాలకి అలవాటుపడి, మీ మనుగడకి మీరే ప్రశ్నార్ధకంగా మారుతున్నారు. మీరు సంపాదించే ఆస్తులు, అంతస్తులు, హోదా, డబ్బు, చివరికి మీ జీవితం...అన్నీ అశాశ్వతమే అని మరొక్కసారి మీకందరికీ తెలియజేయడానికి నిన్నటి భూకంపం ద్వారా చిన్న హెచ్చరిక జారీ చేసాను. మీకు తెలివి చాలా ఎక్కువ. ఈ పాటికీ అర్ధమయుంటుంది నేను చెప్పాలనుకునే విషయం! మానవతావిలువలపట్ల నమ్మకం, నా యందు విశ్వాసం, శ్రేయస్సుకోసం సమాజం, ఆత్మీయతులపట్ల అనురాగం, ప్రకృతి మరియు ఇతర జీవకారుణ్యాలపట్ల మమకారం పెంపొందించే ఆలోచనా సరళిని అలవర్చుకోండి."
..ప్రయత్నిస్తే, ఆచరణలో సాధ్యంగాని విషయం ఉండదు గనక, దేవుని సందేశాన్ని మనమంతా పాటిద్దాం!
--- ఎస్.పి. సోమసుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







