మానవులందరికీ హెచ్చరిక!
- May 06, 2015
నేపాల్ లోని ఖాట్మండు ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం కొన్నివేల ప్రాణాలను బలిగొన్నది. మరొక మారు నిద్రావస్థలో ఉన్న ప్రపంచాన్ని దేవుడు ఒక్కసారి తట్టిలేపాడు, ఈ క్రింది విధంగా అందరికీ హెచ్చరిక జారీ చేసాడు:
"నేను మానవ జాతిని సృష్టించాను. కొన్ని పరిమితులను, హద్దులను నిర్దేశించాను. మీరు వీటికి 'మానవతావిలువలు' అని పేరు పెట్టారు. నేను మిమ్మల్ని సృష్టిస్తే, మీరు డబ్బుని కనిపెట్టారు.నా దృష్టిలో అందరూ సమానమైతే మీ దృష్టిలో అశాశ్వతమైన 'డబ్బు'ని సంపాదించడంలో మానవతావిలువలకు తిలోదకాలిచ్చి, అశాశ్వతమైన సుఖాలకి అలవాటుపడి, మీ మనుగడకి మీరే ప్రశ్నార్ధకంగా మారుతున్నారు. మీరు సంపాదించే ఆస్తులు, అంతస్తులు, హోదా, డబ్బు, చివరికి మీ జీవితం...అన్నీ అశాశ్వతమే అని మరొక్కసారి మీకందరికీ తెలియజేయడానికి నిన్నటి భూకంపం ద్వారా చిన్న హెచ్చరిక జారీ చేసాను. మీకు తెలివి చాలా ఎక్కువ. ఈ పాటికీ అర్ధమయుంటుంది నేను చెప్పాలనుకునే విషయం! మానవతావిలువలపట్ల నమ్మకం, నా యందు విశ్వాసం, శ్రేయస్సుకోసం సమాజం, ఆత్మీయతులపట్ల అనురాగం, ప్రకృతి మరియు ఇతర జీవకారుణ్యాలపట్ల మమకారం పెంపొందించే ఆలోచనా సరళిని అలవర్చుకోండి."
..ప్రయత్నిస్తే, ఆచరణలో సాధ్యంగాని విషయం ఉండదు గనక, దేవుని సందేశాన్ని మనమంతా పాటిద్దాం!
--- ఎస్.పి. సోమసుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







