కాన్క్లేవ్ ఆఫ్ యోగా ఆర్గనైజేషన్స్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- April 08, 2018
మస్కట్: కాన్క్లేవ్ ఆఫ్ యోగా ఆర్గనైజేషన్స్ని ఇండియన్ ఎంబసీ ఏప్రిల్ 6న నిర్వహించింది. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్గా దీన్ని నిర్వహించారు. 2018 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. సుల్తానేట్ పరిధిలో పెద్ద సంఖ్యలో యోగా ఆర్గనైజేషన్స్ అలాగే టీచర్స్ ఈ కాన్క్లేవ్లో పాల్గొన్నారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా వుందనీ, యోగాని విశ్వవ్యాపితం చేయడంలో భారత ప్రధాని నరేంద్రమోడీ కృషి మరవలేనిదని భారత అంబాసిడర్ ఇంద్రా మణి పాండే చెప్పారు. గత ఏడాది 4,500 మందికి పైగా ఒమనీ మరియు భారత యోగా ఔత్సాహికులు, ప్రాక్టీషనర్స్, బిగినర్స్ ఈ యోగా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మరింత ఘనంగా యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించనున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







