కాన్క్లేవ్ ఆఫ్ యోగా ఆర్గనైజేషన్స్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- April 08, 2018
మస్కట్: కాన్క్లేవ్ ఆఫ్ యోగా ఆర్గనైజేషన్స్ని ఇండియన్ ఎంబసీ ఏప్రిల్ 6న నిర్వహించింది. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్గా దీన్ని నిర్వహించారు. 2018 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. సుల్తానేట్ పరిధిలో పెద్ద సంఖ్యలో యోగా ఆర్గనైజేషన్స్ అలాగే టీచర్స్ ఈ కాన్క్లేవ్లో పాల్గొన్నారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా వుందనీ, యోగాని విశ్వవ్యాపితం చేయడంలో భారత ప్రధాని నరేంద్రమోడీ కృషి మరవలేనిదని భారత అంబాసిడర్ ఇంద్రా మణి పాండే చెప్పారు. గత ఏడాది 4,500 మందికి పైగా ఒమనీ మరియు భారత యోగా ఔత్సాహికులు, ప్రాక్టీషనర్స్, బిగినర్స్ ఈ యోగా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మరింత ఘనంగా యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించనున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







