కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు 17కి పెరిగిన పతకాలు

- April 08, 2018 , by Maagulf
కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు 17కి పెరిగిన పతకాలు

గోల్డ్‌ కోస్ట్‌: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో తాజాగా మరో రెండు పతకాలను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పట్టికలో భారత్‌ పతకాల సంఖ్య 15 నుంచి 17కు పెరిగింది. ఇంతవరకు భారత్‌ 8 స్వర్ణాలు సాధించగా, రజత పతకాలు మూడు నుంచి నాలుగుకు, కాంస్య పతకాలు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. తాజాగా సాధించిన ఈ రెండు పతకాల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో మెహులీ ఘోష్‌ రజతం సాధించగా, అదే విభాగంలో అపూర్వీ చందేలా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com