జపాన్లో భూకంపం
- April 08, 2018
టోక్యో: జపాన్లో సోమవారం వేకువజామున 1.32 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) ప్రకారం..భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఓడా పట్టణంలో సంభవించింది.
ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అలాగే నీటి సరఫరా సమస్య కూడా తలెత్తింది. ఈ భూకంపం వల్ల పట్టణంలో పలు భవనాలకు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ న్యూక్లియర్ పవర్ స్టేషన్లకు ఎటువంటి ప్రమాదం కలగలేదు..యథావిధిగా పనిచేస్తున్నాయి. ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేయలేదు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







