దుబాయ్ - అబుదాబీ: ఆర్టిఎ లగ్జరీ బస్ ఫ్లీట్
- April 09, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ - అబుదాబీ మధ్య ప్రయాణీకుల కోసం లగ్జరీ బస్సుల్ని ప్రారంభించనుస్త్రంది. వాల్వో కోచెస్, వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామనీ, హై ఎండ్ ఫీచర్స్ వీటిల్లో వుంటాయని అధికారులు తెలిపారు. రూమీ సీట్స్, ఫ్రీ ఇంటర్నెట్, యూఎస్బీ పోర్టల్స్ (ఫోన్ ఛార్జింగ్ కోసం), ఫుట్ రెస్ట్స్, కప్ హోల్డర్స్ ఈ బస్సులో అదనపు సౌకర్యాలు. హైడ్రాలిక్ లిఫ్ట్ కారణంగా ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతంగా వుండనున్నాయి ఈ బస్సులు. మెనా రీజియన్లో ఈ తరహా బస్సుల్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. 465 మిలియన్ దిర్హామ్ల ప్రోగ్రామ్లో భాగంగా మొత్తం 316 బస్సులు రావాల్సి వుండగా, మొదట 143 కోచ్లు అందుబాటులోకి వస్తాయి. 2019 నాటికి ఈ సంఖ్య 2085కి చేరుతుంది. దుబాయ్లో మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







