టీవీ వాల్యూమ్ గొడవ: రూమ్ మేట్ హత్య
- April 12, 2018
అబుదాబీలో ఓ కార్మికుడు, తన రూమ్మేట్ని కేవలం టీవీ వాల్యూమ్ గొడవ కారణంగా హత్య చేసిన ఘటన అందర్నీ కలచివేసింది. తాను నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో రూమ్మేట్ వాల్యూమ్ పెంచడంతో ఆగ్రహానికి గురైనట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. ఈ కేసులో నిందితుడు ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అబుదాబీ క్రిమినల్ కోర్టులో నిందితుడు ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. టీవీ వాల్యూమ్ విషయంలో తలెత్తిన గొడవ ముదిరి పాకాన పడ్డంతో, ఆసియాకి చెందిన వ్యక్తి, తన రూమ్ మేట్ని కత్తితో కడుపులో బలంగా పొడిచాడు. ఈ గొడవని మరో రూమ్ మేట్ ప్రత్యక్షంగా చూశాడు. పోలీసులకు ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు తొలుత తన నేరాన్ని అంగీకరించలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







