టీవీ వాల్యూమ్ గొడవ: రూమ్ మేట్ హత్య
- April 12, 2018
అబుదాబీలో ఓ కార్మికుడు, తన రూమ్మేట్ని కేవలం టీవీ వాల్యూమ్ గొడవ కారణంగా హత్య చేసిన ఘటన అందర్నీ కలచివేసింది. తాను నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో రూమ్మేట్ వాల్యూమ్ పెంచడంతో ఆగ్రహానికి గురైనట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. ఈ కేసులో నిందితుడు ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అబుదాబీ క్రిమినల్ కోర్టులో నిందితుడు ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. టీవీ వాల్యూమ్ విషయంలో తలెత్తిన గొడవ ముదిరి పాకాన పడ్డంతో, ఆసియాకి చెందిన వ్యక్తి, తన రూమ్ మేట్ని కత్తితో కడుపులో బలంగా పొడిచాడు. ఈ గొడవని మరో రూమ్ మేట్ ప్రత్యక్షంగా చూశాడు. పోలీసులకు ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు తొలుత తన నేరాన్ని అంగీకరించలేదు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









