స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- April 12, 2018
మస్కట్: హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్స్ని స్మగ్లింగ్ చేయడం వంటి నేరాలకు సంబంధించి ముగ్గురు వలసదారుల్ని సుల్తానేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఓ కేసులో ఇద్దరు వలసదారుల్ని విలాయత్ ఆఫ్ లివా కోస్ట్లో అరెస్ట్ చేశారు. వీరిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించారు. మరో కేసులో బిద్బిద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. డ్రగ్స్ని వియ్రిస్తుండడం, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడటం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. స్మగ్లింగ్ బోట్ ద్వారా మనుషుల్ని సుల్తానేట్లోకి తీసుకురావడం, డ్రగ్స్ని సైతం తీసుకురావడం చేస్తున్నారని నిందితుల గురించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు. అల్ దఖ్లియా గవర్నరేట్ పోలీస్ నాయకత్వంలో యాంటీ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ డిపార్ట్మెంట్ ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







