హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ని కూల్చేసిన సౌదీ ఎయిర్ ఫోర్స్
- April 12, 2018
రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్, హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి సంధించిన బాలిస్టిక్ మిస్సైల్ని విజయవంతంగా కూల్చేశాయి. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ వివరాల్ని వెల్లడించింది. అరబ్ కోలిషన్ ఫోర్సెస్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మల్కి ఓ ప్రకటనలో సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్ని అత్యంత చాకచక్యంగా కూల్చేశారని పేర్కొన్నారు. యెమెనీ గవర్నరేట్ సాదా పరిధిలోని సాదా నుంచి జజాన్ వైపు ఈ మిస్సైల్ దూసుకొచ్చేందుకు యత్నించింది. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు మిస్సైల్స్ని సంధిస్తూ వుంటారు. ఇరాన్ నుంచి వారికి ఆయుధాల పరంగా సహాయం అందుతూ వస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









