ఏ.ఆర్.ఆర్ కు 2 అవార్డులు..ఉత్తమ గాయకుడిగా జేసుదాస్,గాయనిగా సాషా తిరుపతి

- April 13, 2018 , by Maagulf
ఏ.ఆర్.ఆర్ కు 2 అవార్డులు..ఉత్తమ గాయకుడిగా జేసుదాస్,గాయనిగా సాషా తిరుపతి

అస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహ్మాన్ ను రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులు వరించాయి.. తమిళం మూవీ కాట్రూ వెలియదై కి సంగీత దర్శకత్వం వహించిన ఎ ఆర్ రెహ్మాన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, బాలీవుడ్ మూవీ మామ్ చిత్రానికి నేపథ్య సంగీతం అందిచినందుకు గానూ ఆయనకు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీత దర్శకుడిగానూ అవార్డుల లభించాయి.. ఇక ఉత్తమ గాయకుడిగా జేసుదాసుకి, ఉత్తమ గాయని అవార్డు సాషా తిరుపతికి వచ్చాయి.. ఈ 65వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ఆ కమిటీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com