శబ్ద కాలుష్యం: 626 మందికి జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- April 13, 2018
అబుదాబీ పోలీసులు, 626 వాహనాల్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనాలు అధిక శబ్దానికి కారణమవడంతోనే వాటిని సీజ్ చేసి, జరీమానాలు విధించామనీ, అలాగే 12 బ్లాక్ పాయింట్స్ని కూడా విధించామనీ పేర్కొన్నారు. 2018 తొలి క్వార్టర్లో పోలీసులకు పట్టుబడ్డ వాహనాల సంఖ్య ఇది. వాహన డ్రైవర్లకు 2000 దిర్హామ్ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ ఖలీఫా అల్ ఖయిల్ మాట్లాడుతూ, భారీ శబ్దాల కారణంగా వినికిడి శక్తి తగ్గుతుందనీ, అదే సమయంలో ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగిపోతాయని చెప్పారు. ఈ కారణంగా డ్రైవింగ్ బిహేవియర్లో తీవ్రమైన మార్పులొస్తాయని తద్వారా ప్రమాదాలు జరుగుతాయని ఆయన వివరించారు. యంగ్ డ్రైవర్స్ ఈ తరహా అతి ప్రవర్తనకు దూరంగా వుండాలని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రులు, స్కూల్స్ వద్ద శబ్దాన్ని చాలా తక్కువగా వినియోగించాలని సూచించారాయన.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







