శబ్ద కాలుష్యం: 626 మందికి జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- April 13, 2018
అబుదాబీ పోలీసులు, 626 వాహనాల్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనాలు అధిక శబ్దానికి కారణమవడంతోనే వాటిని సీజ్ చేసి, జరీమానాలు విధించామనీ, అలాగే 12 బ్లాక్ పాయింట్స్ని కూడా విధించామనీ పేర్కొన్నారు. 2018 తొలి క్వార్టర్లో పోలీసులకు పట్టుబడ్డ వాహనాల సంఖ్య ఇది. వాహన డ్రైవర్లకు 2000 దిర్హామ్ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ ఖలీఫా అల్ ఖయిల్ మాట్లాడుతూ, భారీ శబ్దాల కారణంగా వినికిడి శక్తి తగ్గుతుందనీ, అదే సమయంలో ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగిపోతాయని చెప్పారు. ఈ కారణంగా డ్రైవింగ్ బిహేవియర్లో తీవ్రమైన మార్పులొస్తాయని తద్వారా ప్రమాదాలు జరుగుతాయని ఆయన వివరించారు. యంగ్ డ్రైవర్స్ ఈ తరహా అతి ప్రవర్తనకు దూరంగా వుండాలని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రులు, స్కూల్స్ వద్ద శబ్దాన్ని చాలా తక్కువగా వినియోగించాలని సూచించారాయన.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









