బ్యాంక్ ఎంప్లాయీకి లంచం: ఇద్ద్గరికి జైలు
- April 13, 2018
ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా మరొకరు ఇండియన్. అలాగే ఈ ఇద్దరికీ 40,000 దిర్హామ్ల జరీమానా సైతం విధించింది. శిక్ష అనంతరం వీరు స్వదేశానికి డిపోర్టేషన్ చేయబడ్తారు. బ్యాంకు ఉద్యోగి ఒకరికి లంచం ఇచ్చి, తద్వారా తమ పనుల్ని పూర్తి చేసుకోవాలని నిందితులు ప్రయత్నించినట్లు నిందితులపై అభియోగాలుఏ మోపబడ్డాయి. విచారణలో వీరిపై నేరాల్ని నిరూపించారు. ఈ కేసులో మరో భారతీయ వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం. ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా లోన్లు పొందేందుకు నిందితులు యత్నించారు. ఇందుకుగాను బ్యాంకు ఉద్యోగికి లోన్ అమౌంట్లో 10 శాతం లంచంగా ఎరచూపారు. 2017 ఫిబ్రవరి 1న ఈ ఘటన చోటు చేసుకుంది. మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్లో మార్చి 1న ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









