బ్యాంక్‌ ఎంప్లాయీకి లంచం: ఇద్ద్గరికి జైలు

- April 13, 2018 , by Maagulf
బ్యాంక్‌ ఎంప్లాయీకి లంచం: ఇద్ద్గరికి జైలు

ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా మరొకరు ఇండియన్‌. అలాగే ఈ ఇద్దరికీ 40,000 దిర్హామ్‌ల జరీమానా సైతం విధించింది. శిక్ష అనంతరం వీరు స్వదేశానికి డిపోర్టేషన్‌ చేయబడ్తారు. బ్యాంకు ఉద్యోగి ఒకరికి లంచం ఇచ్చి, తద్వారా తమ పనుల్ని పూర్తి చేసుకోవాలని నిందితులు ప్రయత్నించినట్లు నిందితులపై అభియోగాలుఏ మోపబడ్డాయి. విచారణలో వీరిపై నేరాల్ని నిరూపించారు. ఈ కేసులో మరో భారతీయ వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది న్యాయస్థానం. ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా లోన్లు పొందేందుకు నిందితులు యత్నించారు. ఇందుకుగాను బ్యాంకు ఉద్యోగికి లోన్‌ అమౌంట్‌లో 10 శాతం లంచంగా ఎరచూపారు. 2017 ఫిబ్రవరి 1న ఈ ఘటన చోటు చేసుకుంది. మురాక్కాబాత్‌ పోలీస్‌ స్టేషన్‌లో మార్చి 1న ఫిర్యాదు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com