మనామా:పేలుడు కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
- April 20, 2018మనామా:హై క్రిమినల్ కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. బుడైయా హైవేపై ఓ పేలుడుకి సంబంధించిన కేసులో ఈ ముగ్గురూ దోషులుగా తేలారు. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చిందని చెప్పారు. హత్యకు యత్నించడం, పేలుడు పదార్థాల్ని వినియోగించేందుకు శిక్షణ పొందడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం, ఉపయోగించడం, విధ్వంసాలకు పాల్పడటం వంటి అభియోగాలు వీరిపై నిరూపించబడ్డాయి. నిందితుల్లో ఇద్దరి పౌరసత్వాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. అల్ కాదమ్ ట్రాఫిక్ లైట్ వద్ద బాంబుని వుంచి, పేల్చారు నిందితులు. అబు సైబా వద్ద బుడైయా హైవేపై ఈ పేలుడు చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ