లండన్ వెళ్లిపోయిన నవాజ్ షరీఫ్?
- April 21, 2018
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దొంగచాటుగా లండన్ పారిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్యను చూసేందుకే ఆయన లండన్ వెళ్లారని చెపుతున్నారు.
అక్రమ రహదారి నిర్మాణానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎన్ఏబీ షరీఫ్కు సమన్లు జారీచేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాని షరీఫ్పై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని త్యజించారు.
ఈ పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ తన కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. క్యాన్సర్ బారిన పడి లండన్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన భార్య బాగోగులు చూసుకోవడానికి వెళ్లినట్టు సమాచారం. ఆయన తిరుగు ప్రయాణంపై ఎలాంటి సమాచారం లేదు.
మరోవైపు, ఈ నెల 21వ తేదీన లాహోర్లోని నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉంది. అలాగే, 23వ తేదీన అవినీతి కేసులో కూడా ఏప్రిల్ 23వ తేదీన ఆయన కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉన్నది. దాని నుంచి తప్పించుకొనేందుకు దేశాన్ని వీడారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆయన తిరిగి ఇస్లామాబాద్కు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









