సౌదీ అధికారిక భవనం వద్ద పేలుడు
- April 21, 2018ఇస్తాంబుల్ : సౌదీ అరేబియా అధికార నివాసం వద్ద శనివారం సాయంత్రం పేలుడు జరిగిందని సోషల్మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై వివరణనిచ్చిన అధికారులు వారి అనుమతి లేకుండా అధికారిక నివాసం వద్ద డ్రోన్ను ప్రయోగిస్తున్నారని భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు తెలిపారు. భద్రతా దళాలు రియాద్కు సమీపంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనమైన అల్- ఖజోమా వద్ద ఒక డ్రోన్ను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో భద్రతా దళాలు దానిని పేల్చివేశాయని తెలిపారు. అయితే ఇది రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఒక బొమ్మ విమానం అని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యెమెన్ నుండి తరచుగా వచ్చే దాడుల నేపథ్యంలో సౌదీ భద్రతా దళాలు గట్టి భద్రతలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ పేలుడు జరిగిన సమయంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనంలో లేరని సౌదీ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..