మేడే సెలబ్రేషన్స్ నిర్వహించనున్న బహ్రెయిన్ కేరళీయ సమాజం
- April 23, 2018మనామా:బహ్రెయిన్ కేరళీయ సమాజం, మేడే సెలబ్రేషన్స్ని మే 1వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కల్చరల్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తారు. కింగ్డమ్లోని పలు లేబర్ క్యాంప్స్ నుంచి సుమారు 2000 మంది వరకు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇండియన్ మూవీ సాంగ్స్, మలయాళం ఫోక్ సాంగ్స్, మిమిక్రీ, మోనోయాక్ట్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు కూడా నిర్వహిస్తామని బికెఎస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ మోహన్ రాజ్ పి.ఎన్ అలాగే జనరల్ సెక్రెటరీ ఎంపి రఘు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడుకలు జరుగుతాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రతినిథి డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారీ, ఇండియన్ ఎంబసీ ప్రతినిథులు, తదితరులు వాలెడిక్టరీ ఫంక్షన్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఎంప్లాయర్స్ని ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..